- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీఎస్ఆర్టీసీకి టీడీపీ లేఖ.... బస్సులు అద్దెకివ్వాలని కోరినా ఇవ్వలేదని ఆవేదన
దిశ, వెబ్ డెస్క్: ఏపీఎస్ఆర్టీసీ ఎండీ తిరుమలరావుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తమ సభలకు బస్సులు అద్దెకివ్వాలని కోరినా ఇవ్వడంలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభలకు ఆర్టీసీ బస్సులు పంపుతూ వివక్ష చూపిస్తున్నారని వాపోయారు. ఈ నెల 17న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో టీడీపీ- జనసేన బహిరంగ సభ ఉందని, అందుకు ఆర్టీసీ బస్సులను ఇవ్వాలని కోరారు. ఉభయ రాష్ట్రాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా బస్సు సర్వీసులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సభకు రావడమే కాకుండా వారిని సురక్షితంగా స్వగ్రామాలకు చేర్చాల్సిన అవసరం ఉందని.. అందుకు రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. టీడీపీ, జనసేన బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అచ్చెన్నాయుడు సున్నితంగా హెచ్చరించారు.