ఆర్5జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు: సుప్రీంకోర్టు

by Disha Web Desk 16 |
ఆర్5జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చు: సుప్రీంకోర్టు
X

దిశ,వెబ్ డెస్క్: ఆర్ -5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆర్- జోన్‌లో గుంటూరు, విజయవాడ ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని ప్రాంత రైతులు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజధాని ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్లు ఇవ్వొదంటూ వాదనలు వినిపించారు. అయితే ఆర్-5 జోన్‌లో పేదలకు ఇళ్లు ఇవ్వొచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై రాజధాని ప్రాంత రైతులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీంతో సుధీర్ఘంగా విచారించిన ధర్మాసనం తుది తీర్పు ఇచ్చింది. ఆర్-5జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని పేర్కొంది. అంతేకాదు హైకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని ఆదేశించారు

Also Read..

ఆర్-5 జోన్‌లో పరిశ్రమల రాకను అడ్డుకోవడానికే స్కెచ్?



Next Story