బ్రేకింగ్ న్యూస్: బైక్‌ను ఢీకొన్న వరికోత యంత్రం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Disha Web Desk 16 |
బ్రేకింగ్ న్యూస్: బైక్‌ను ఢీకొన్న వరికోత యంత్రం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: వరికోత యంత్రం రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. పొలాల్లో వరి కోతలు చేయాల్సిన యంత్రాన్ని డ్రైవర్ రోడ్డుపై అతివేగంగా నడిపారు. దీని ఫలితంగా రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని వేగంగా వరికోత యంత్రం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వినుకొండం మండలం చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద జరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు కన్నీరు మున్నీరయ్యారు. రోడ్డుపై ఆందోళనకు దిగారు. తమ వాళ్ల ప్రాణాలు పోవడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed