- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
Mangalagiri: ఆలయాల బాట పట్టిన నారా లోకేష్ కుటుంబం
by srinivas |
![Mangalagiri: ఆలయాల బాట పట్టిన నారా లోకేష్ కుటుంబం Mangalagiri: ఆలయాల బాట పట్టిన నారా లోకేష్ కుటుంబం](https://www.dishadaily.com/h-upload/2024/01/07/295458-nara-lokesh.webp)
X
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబసమేతంగా మంగళగిరిలో ప్రముఖ ఆలయాలను సందర్శించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి, తనయుడు దేవాన్ష్తో కలిసి ఆదివారం ఉదయం మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామికి కిరీటం అలంకరించి, చెంచులక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి, పట్టువస్త్రాలు సమర్పించి, వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు.
శివాలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పానకాల లక్ష్మీనరసింహస్వామి మెట్లపూజ చేశారు. మెట్ల మార్గంలో వెళ్లి పానకాల స్వామిని దర్శించుకున్నారు. కొండపై ఉన్న రాజ్యలక్ష్మి అమ్మవారిని పూజించి హారం, పట్టువస్త్రాలను లోకేష్ సమర్పించారు.
Next Story