Amaravathi: R5 జోన్‌లో ప్రమాదం.. 17 మందికి గాయాలు

by Disha Web Desk 16 |
Amaravathi: R5 జోన్‌లో ప్రమాదం.. 17 మందికి గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి, నిడమర్రులో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో ఆర్5 జోన్ లేఅవుట్ లో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. నిడమర్రులోని 175 ఎకరాల్లో ప్రభుత్వం భారీ లేఅవుట్ వేసింది. ఇందులో ఇళ్లు నిర్మాణం చేపట్టేందుకు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం టెంట్లు వేశారు. అయితే ఒక్కసారిగా గాలిదుమారం దెబ్బకు ఓ భారీ వృక్షం విరిగిపడింది. ఈ ఘటనలో 17 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

కాగా ఆర్ 5 జోన్ పరిధిలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం లేఅవుట్లు వేసే పనులను వేగం చేసింది. శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మరోవైపు గాలి దుమారం కూడా చెలరేగి వాన పడింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed