దారుణమైన ట్రోల్స్.. .. ప్రముఖ మీడియాపై విడదల రజిని ఫిర్యాదు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-13 05:55:02  IST  )

ఎన్‌హెచ్ఆర్సీతో పాటు హెచ్‌ఆర్సీని మాజీ మంత్రి విడదల రజిని ఆశ్రయించారు..

దారుణమైన ట్రోల్స్.. .. ప్రముఖ మీడియాపై  విడదల రజిని  ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్‌హెచ్ఆర్సీ(NHRC)తో పాటు హెచ్‌ఆర్సీ(HRC)ని మాజీ మంత్రి విడదల రజిని(Former Minister Vidadala Rajini) ఆశ్రయించారు. తనను ప్రముఖ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కొందరు టోల్స్ చేస్తున్నారంటూ, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. తమ పార్టీ అధినేత జగన్(Ys Jagan)ను, ఆయన కుటుంబ సభ్యులను, మాజీ మంత్రి రోజా(Roja)ను సైతం ట్రోల్స్ చేస్తున్నారంటూ రజిని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత దారుణంగా దూషణలు చేస్తున్నారని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేశారు. తమను ట్రోల్స్‌ చేస్తున్న ప్రముఖ తెలుగు మీడియా సహా సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story