Guntur: ఘోర ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య

by Disha Web Desk 16 |
Guntur: ఘోర ప్రమాదం.. పెరిగిన మృతుల సంఖ్య
X

దిశ, డైనమిక్ బ్యూరో : గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగింది. ప్రతిపాడు మండలం కొండెపాడుకు చెందిన 40 మంది గ్రామస్తులు ఓ శుభకార్యం నిమిత్తం ట్రాక్టర్‌లో చేబ్రోలు మండలం జూపుడికి వెళ్తున్నారు. ఈ సమయంలో ట్రాక్టర్ అదుపు తప్పి పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలంలోనే ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు.

క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. గాయపడినవారిలో మరొకరి పరిస్థితి సీరియస్‌గా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో కొందరికి కాళ్లు, చేతులు విరిగిపోయాయి. ఆస్పత్రిలో క్షతగాత్రుల హాహాకారాలు మిన్నంటాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed