Big Breaking: బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |   (  Updated:2023-03-31 10:04:54  IST  )

బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది..

Big Breaking: బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ నేత సత్యకుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేపట్టిన ఆందోళన 1200వ రోజుకు చేరింది. అయితే మద్దతు తెలిపేందుకు సత్యకూమార్ వెళ్లారు. దీక్షా శిబిరం వద్ద రైతులను కలిసి తుళ్లూరులోని పార్టీ నాయకుడిని పరామర్శించారు. తిరిగి వెళ్తుండగా మందడం దగ్గర ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. అంతేకాదు రాళ్లు సైతం రువ్వారు. దీంతో సత్యకుమార్ కాన్వాయ్‌లోని కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

Next Story