- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగపూర్కు ఏపీ ఉపాధ్యాయుల బృందం.. అక్కడి విద్యా ప్రమాణాలపై అధ్యయనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయుల(Teachers)కు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాల(International education standard)పై అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సింగపూర్లో పర్యటించనుంది. విదేశీ విద్యా విధానాలను అధ్యయనం చేసి, అక్కడి ఉత్తమ బోధనా పద్ధతులను మన రాష్ట్ర పాఠశాలల్లో అమలు చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై అధ్యయనం
ఈ పర్యటనలో భాగంగా ఉపాధ్యాయులు సింగపూర్(Singapur)లోని ప్రముఖ విద్యా సంస్థలను సందర్శిస్తారు. అక్కడి పాఠశాలల్లో అనుసరిస్తున్న వినూత్న బోధనా రీతులు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, సాంకేతికతను విద్యలో ఎలా అనుసంధానిస్తున్నారో క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ అధ్యయనం ద్వారా రాష్ట్ర విద్యావ్యవస్థలో మరిన్ని సానుకూల మార్పులు తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది.
త్వరలోనే ఫిన్లాండ్కు..
మరోవైపు రాష్ట్రంలోని మిగిలిన ఉత్తమ ఉపాధ్యాయులను కూడా ప్రపంచ స్థాయి విద్యా విధానాలపై అధ్యయనం కోసం త్వరలోనే ఫిన్లాండ్ పంపేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విద్యారంగంలో అగ్రగామిగా ఉన్న దేశాలను సందర్శించడం వల్ల ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయని, తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.






