- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap News: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హెల్త్ స్కీమ్లోకి 46 రకాల చికిత్సలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది..

X
దిశ,డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఉద్యోగులందరికీ మరింత మేలు జరిగేలా కీలక నిర్ణయిం తీసుకుంది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలను శాశ్వతంగా చేరుస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు బుధవారం వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రతీ ఏటా రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం తెలిపింది. శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలు అందనున్నట్లు ప్రకటించింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు ఈ 46 రకాల క్యాన్సర్ చికిత్సలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకు ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి: Visakha: కలాం పేరు తీసేసి వైఎస్సార్ పేరు.. సీఎం జగన్పై ఆగ్రహం
Next Story






