- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gunturu : కిడ్నాపర్ల నుంచి తెలివిగా తప్పించుకున్న బాలిక
by Muthe.Rajitha |
గుంటూరు(Gunturu) జిల్లాలో కిడ్నాపర్ల చర్య నుంచి ఓ బాలిక తెలివిగా తప్పించుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : గుంటూరు(Gunturu) జిల్లాలో కిడ్నాపర్ల చర్య నుంచి ఓ బాలిక తెలివిగా తప్పించుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వెంగళరావునగర్లో తల్లికి యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కిడ్నాపర్లు బాలికను కారులో ఎత్తుకు వెళ్లారు. విజయవాడలో దుండగులు భోజనం చేయడానికి దిగినపుడు, డోర్ లాక్ పడని విషయాన్ని గమనించిన బాలిక తప్పించుకొని విజయవాడ బస్టాండ్(Viyawada RTC Bustand) కంట్రోల్ రూమ్ సిబ్బందికి జరిగిన విషయం తెలిపింది. అప్రమత్తమైన సిబ్బంది వెనటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగానే కిడ్నాపర్లు కారు వదిలేసి పారిపోయాయి. దుండగులు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకొని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బాలిక చాకచక్యంగా వ్యవహరించిన తీరును అందరూ ప్రశంసించారు.
Next Story






