Group-2 Results: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన

by Kema Shiva Kumar |   (  Updated:2024-04-03 12:57:18  IST  )

గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీపీఎస్‌సీ ఫలితాల విడుదలపై కీలక ప్రకటన చేసింది.

Group-2 Results: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఫలితాల విడుదలపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్-2 అభ్యర్థులకు ఏపీపీఎస్‌సీ ఫలితాల విడుదలపై కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలను శనివారంలోపు ప్రకటించబోతున్నట్లు వెల్లడించింది. వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష రాసిన వారిలో 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు ఎంపిక చేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నోటిఫికేషన్ జారీకి, ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం తమకు ప్రిపరేషన్‌కు సరిపోదని, ప్రశపత్రం కఠినంగా ఉండటం, భారత సమాజం చాప్టర్‌కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా వచ్చాయనే కారణాలతో నానా ఇబ్బందులు పడుతున్నాయని అభ్యర్థులు ప్రభుత్వానికి, ఏపీపీఎస్సీకి అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో ప్రకటించిన పోస్టుల సంఖ్యకు అనుగుణంగా ఒక్క పోస్టుకు వంది మంది చొప్పున మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించాలని బోర్డుకు అభ్యర్థనలు వస్తున్నాయి. ఆ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తుందని ప్రిలిమ్స్ ఫలితాల విడుదల నాటికి అధికారిక నిర్ణయం రావచ్చని తెలుస్తోంది.

Read More..

ఏపీలో హస్తం దెబ్బ ఎవరికి తగులునో?

Next Story