BSNL‌ను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ చర్యలు: కేంద్ర మంత్రి పెమ్మసాని

by Ramesh Naini |

భారత సంచార్ నిగమ్ లిమిటెడ్‌ (BSNL)ను మరింత సమర్థంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు.

BSNL‌ను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వ చర్యలు: కేంద్ర మంత్రి పెమ్మసాని
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్‌ (BSNL)ను మరింత సమర్థంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది.

నెలనెలా నిర్వహిస్తున్న పనితీరు సమీక్షల్లో భాగంగా రెండో రోజు జార్ఖండ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, చెన్నై BSNL సర్కిళ్ల పనితీరును సమగ్రంగా పరిశీలించినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యంగా జార్ఖండ్ సర్కిల్‌ ప్రదర్శించిన భవిష్యత్‌ దృష్టి, వ్యాపార వృద్ధిని లక్ష్యంగా చేసుకుని రూపొందించిన స్పష్టమైన ప్రణాళిక తనను ఎంతగానో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించాలన్న కట్టుబాటుతో కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. BSNL‌ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, సేవల సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ సమీక్షలు దోహదపడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Next Story