మాలో అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుంది: వెంకట్రామిరెడ్డి

by Web Desk |
మాలో అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుంది: వెంకట్రామిరెడ్డి
X

దిశ, ఏపీ బ్యూరో: కర్నూల్ లో ఉద్యోగుల దీక్షలో పాల్గొన్న సచివాలయ ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ ఇలా రావడానికి తమ తప్పు ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధిపత్యం కోసం చేసిన ప్రయత్నాల వల్ల నష్టమే జరిగిందన్నారు. ఉద్యోగుల్లో చీలిక తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మాలో అనైక్యతను ప్రభుత్వం అలుసుగా తీసుకుందని వ్యాఖ్యానించారు. ఇక నుంచి ఉద్యోగ సంఘాలు ఐక్యమత్యంగా ఉండి, పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు సమ్మెకి దిగకుండా ఉండటం, ప్రభుత్వ నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధించే వరకు పోరాటం ఆగదని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.


Next Story