ఆ ఉద్యోగులను తొలగించం.. మంత్రి గుడ్​న్యూస్​

by Thanuru Gopichand |

సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గుడ్​న్యూస్​చెప్పారు

ఆ ఉద్యోగులను తొలగించం.. మంత్రి గుడ్​న్యూస్​
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి గుడ్​న్యూస్​చెప్పారు. ఎవరినీ తొలగించబోమంటూ, వదంతులు నమ్మవద్దంటూ ప్రకటించారు. ఈ రోజు ఆయన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్దీకరణపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో చర్చలు నిర్వహించారు. ఉద్యోగుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. పదోన్నతులు కల్పించాలని, పీఆర్సీ వేయాలని ఉద్యోగులు కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వార్డు, సచివాలయ ఉద్యోగులను ఏబీసీ కేటగిరీలకు హేతు బద్దీకరణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీనియర్​ అధికారులతో కమిటీ వేసి సర్వీసు నిబంధనలను రూపొందిస్తామన్నారు. హేతుబద్దీకరణ అంశపైనా ఈ కమిటీ పరిశీలిస్తుందన్నారు. రేషనలైజేషన్​ప్రక్రియలో కొందరిని తొలగిస్తామని అపోహలు వద్దన్నారు. ఎవరినీ తొలగించడం లేదు.. కొన్ని శాఖలలో చాలా ఖాళీలు ఉన్నాయని వాటిలో భర్తీ చేస్తామన్నారు. మహిళా పోలీసుల విషయంలోనూ నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం శాఖను సంప్రదిస్తామన్నారు. డిపార్ట్​మెంట్​టెస్ట్​పాస్​కాకుండా పదోన్నతులు ఎలా వస్తాయన్నారు.

Next Story