Rammohan Naidu:రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

by Jakkula Mamatha |
Rammohan Naidu:రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. కేంద్రమంత్రి కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రజలకు కేంద్ర పౌరవిమనాయన శాఖ మంత్రి(Minister of Civil Aviation) కింజరాపు రామ్మోహన్ నాయుడు(Kinjarapu Rammohan naidu) గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో ఏపీ నుంచి కొత్త విమానాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తాజాగా ప్రకటించారు. ఈ క్రమంలో ఏపీ నుంచి అబుదాబి(Abu Dhabi), బెంగళూరు(Bengaluru), భువనేశ్వర్(Bhubaneswar) ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రమంతటా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం నుంచి అబుదాబి జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ విమాన సర్వీసులు వారానికి నాలుగు రోజులు పని చేస్తాయని తెలిపారు. ఇక, విశాఖ-భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా ఏపీ, ఒడిశా మధ్య సంబంధాలు బలోపేతమవుతాయి అని పేర్కొన్నారు. విజయవాడ-బెంగళూరు మధ్య ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ సర్వీసులు జూన్ 2 నుంచి ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.



Next Story

Most Viewed