పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే అందజేత

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలో పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పెన్షన్ ను ఒకరోజు ముందుగానే.. అంటే డిసెంబర్ 31నే అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల డీఆర్డీఏ పీడీలు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించింది. జనవరి 1న న్యూ ఇయర్ ను పురస్కరించుకుని ఒకరోజు ముందే పెన్షన్ ఇవ్వనుంది. ఈ క్రమంలో ఆ నగదును గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 30వ తేదీనే విత్ డ్రా చేసుకుని, 31న పంపిణీ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story