ఆంక్షలు సరికాదు.. సఖ్యత ముఖ్యం: వెంకయ్యనాయుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-28 09:03:00  IST  )

ఆంక్షలు సరికాదని.. సఖ్యత ముఖ్యమని అగ్రరాజ్యం అమెరికాకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు..

ఆంక్షలు సరికాదు.. సఖ్యత ముఖ్యం: వెంకయ్యనాయుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంక్షలు సరికాదని.. సఖ్యత ముఖ్యమని అగ్రరాజ్యం అమెరికాకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Former Vice President Venkaiah Naidu) సూచించారు. విశాఖ(Visakha)లో నిర్వహించిన వైవీ సత్యనారాయణ రాసిన ‘బిజినెస్ ఎథిక్ పుస్తకావిష్కరణ’ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు... అగ్రరాజ్యం అమెరికా(America) తీరుపై ఆయన మండిపడ్డారు. అగ్రరాజ్యం సఖ్యతతో ఉండాలి కానీ ఆంక్షలతో కాదని చెప్పారు. ప్రధాని మోడీ(పీఎం Modi) విధానాలతో భారత్‌(Bharat)పై అమెరికా ఆంక్షలు ప్రభావం చూపలేవన్నారు. స్వదేశీ వస్తు నియమాన్ని ప్రోత్సహించాలని, పాటించాలని పిలుపునిచ్చారు. నేటితరం పిల్లలకు నైతికత, విలువలు నేర్పించాలని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Next Story