Breaking: వైసీపీకి భారీ షాక్.. టీడీపీ గూటికి వైసీపీ ప్రముఖ నేత

by Disha Web Desk 3 |
Breaking: వైసీపీకి భారీ షాక్.. టీడీపీ గూటికి వైసీపీ ప్రముఖ నేత
X

దిశ,తుని: కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. తుని మాజీ మున్సిపల్ చైర్మన్ కుసుమంచి శోభారాణి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరారు. కాగా టీడీపీ తీర్ధం పుచ్చుకున్న శోభారాణికి తేటగుంట టీడీపీ ఆఫీసులో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, టీడీపీ అభ్యర్థి దివ్య పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ విషపు సామ్రాజ్యం నుంచి అందరూ బయటికి వస్తున్నారని ఎద్దేవ చేశారు. అలానే సీఎం జగన్ సామాన్యుడు కాదని విషంతో కూడుకున్న వ్యక్తి అని ఆరోపించారు. కడపలో ఫ్యాక్షనిజంను ఆరంభించింది జగన్ తాత రాజారెడ్డి అని ఆరోపించారు.

రాజశేఖర్ రెడ్డిని రాజకీయ నాయకుడు కాగా జగన్ ని నియంతగా పేర్కొన్నారు. ప్రజలందరూ కూటమిని గెలిపించుకుంటేనే ప్రజాస్వామ్యం రక్షింపబడుతుందని, కార్పోరేట్ పాలిటిక్స్ ద్వారా రాష్ట్రంలో అసమానతలు పెరిగాయని,రాష్ట్ర సంపదని రాజకీయ నాయకులు దోచుకుంటున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చట్టం ద్వారా దోచుకున్న సంపదను వెనక్కి తీసుకువచ్చి ప్రజలకు పంచుతామని, ప్రతిపక్ష పార్టీలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క కలం పోటుతో తీసేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తులను పెంపొందించే విధంగా కూటమి పని చేస్తుందని హామీ ఇచ్చారు.

Read More..

వైసీపీకి మరో షాక్ ..కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

Next Story

Most Viewed