వైసీపీకి మరో షాక్ ..కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk 18 |
వైసీపీకి మరో షాక్ ..కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే
X

దిశ ప్రతినిధి,కర్నూలు:వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది.కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ వైసీపీ ని వీడారు. బుధవారం హైదరాబాద్ లో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపాటుకు గురయ్యారు.వైసీపీ అధిష్టానం సిట్టింగ్ తో ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆశావహులకు కాకుండా ఒంగోలుకు చెందిన మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్ కు సీటు కేటాయించింది.దీంతో వైసీపీ అధిష్టానం తీరును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే మురళి కృష్ణ అనుచరులు నిరసన వ్యక్తం తెలిపారు.సీటు రాదని భావించిన ఆయన షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ సందర్భంగా షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Read More..

చంద్రబాబు రాజకీయ వికలాంగుడు: మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు



Next Story