- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nandigam Suresh: మాజీ ఎంపీ నందిగం మరోసారి అరెస్టు.. ఈసారి ఆ కేసులో..
టీడీపీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్దాడికి పాల్పడ్డాడు.

దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ను (Nandigam suresh) పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఈసారి ఆయన ఓ టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన కేసులో అరెస్టు (Arrest) అయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఉద్దండ్రా యునిపాలెంలో నిన్న రాత్రి కారు నడిపే విషయంలో గొడవ జరిగింది. ఓ వ్యక్తి కారును అతివేగంగా నడపడంతో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి రాజు మందలించాడు. కొద్దిసేపటికి రాజుపై నందిగం సురేష్అనుచరులు దాడికి పాల్పడి.. అతనిని సురేష్ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ నందిగం సురేష్, అతని అన్న ప్రభుదాసు, కుటుంబ సభ్యులు కలిసి రాజుపై మరోసారి దాడి చేశారు. గాయపడిన రాజు మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడి ఘటనపై రాజు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నందిగం సురేష్ను అరెస్టు చేశారు. అతనిని తుళ్లూరు పోలీసుస్టేషన్కు తరలించారు. గతంలో అమరావతిలో ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేష్దాదాపు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపి.. అనంతరం బెయిలుపై విడుదల అయ్యారు. ఇప్పుడు మరో కేసులో అరెస్టు అయ్యాడు.






