అంకుశం సినిమాలో రామిరెడ్డి పట్టిన గతే కోడాలి నానికి పడుతుంది: మాజీమంత్రి దేవినేని ఉమా

by Disha Web Desk 21 |
అంకుశం సినిమాలో రామిరెడ్డి పట్టిన గతే కోడాలి నానికి పడుతుంది: మాజీమంత్రి దేవినేని ఉమా
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి కొడాలి నానికి అంకుశం సినిమాలో రామిరెడ్డికి పట్టిన గతే పడుతుందంటూ మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు. గతంలో చంద్రబాబు నాయుడు బూట్లు నాకిన గుడివాడ గుట్కా, సన్నబియ్యం సన్నాసి కొడాలి నాని అని మండిపడ్డారు. రాజకీయ అవకాశాలిచ్చిన నాయకుడి కుటుంబాన్నే ఇప్పుడు ఈ దరిద్రుడు నోటికొచ్చినట్లు తిడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కొడాలి నాని ఇష్టం వచ్చినట్లు దూసిస్తున్నారని మండిపడ్డారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి గురించి కూడా నీచంగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కొడాలి నాని పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. మరోవైపు పోలవరం కట్టినోడు జైల్లో.. నాశనం చేసినోడు గద్దెనెక్కాడు అని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విరుచుకుపడ్డారు.

సీఎం జగన్ వెన్నులో వణుకు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌‌పై వైసీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న వైసీపీ కుట్రలు చేస్తోందని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేస్తున్నా పార్టీ క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని అన్నారు. అంతేకాదు నారా లోకేశ్‌ను సైతం అరెస్ట్ చేయాలని వైసీపీ కుట్రలు చేస్తోందని అన్నారు. ఇలా అక్రమ అరెస్టులతో తెలివితక్కువ ప్రబుద్దులు ఎన్నికుట్రలు పన్నినా టీడీపీని ఏం చేయలేరని హెచ్చరించారు. ఈ దుర్మార్గ ముఖ్యమంత్రికి అధికారం, ధనబలం అన్నీ తోడవడంతో మరింత అరాచకాలకు పాల్పడుతున్నాడని మాజీమంత్రి దేవినేని ఉమా ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణ, టీడీపీ-జనసేన పొత్తులతో సీఎం జగన్‌ వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. ఆ భయంతోనే గేర్ మార్చాల్సిందేనని అంటున్నారని అన్నారు. ఇలాగయితే వందమంది సిట్టింగ్‌లను మార్చాల్సి వస్తుందని అన్నాడని చెప్పుకొచ్చారు. ఈ మాటలతో ఆయన ఓటమిని ఒప్పుకున్నట్లేనని చెప్పుకొచ్చారు. తొండాట ఆడుతున్న జగన్ రాబోయే ఎన్నికల్లో ఓడిపోక తప్పదని మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబును అనేక కేసుల్లో ఇరికించి ఎక్కువకాలం జైల్లో వుంచి జగన్ రాక్షసానందం పొందతున్నాడని మండిపడ్డారు. కోడికత్తితో పొడిపించుకుని జగన్ సానుభూతితో ముఖ్యమంత్రి అయ్యాడని... పొడిపించిన బొత్స మంత్రి అయ్యాడంటూ మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు.


Next Story

Most Viewed