పేదల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి NTR: చంద్రబాబు

by Disha Web Desk 19 |
పేదల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి  NTR: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: పేదల గురించి ఆలోచించిన ఏకైక వ్యక్తి దివంగత సీఎం ఎన్టీఆర్ అని చంద్రబాబు కొనియాడారు. రాజమండ్రిలో జరుగుతోన్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి హాజరై చంద్రబాబు ప్రసంగించారు. ఎంతో మంది నాయకులు వచ్చారు.. ఎన్నో పార్టీలు పెట్టారు.. కానీ తెలుగు వారి రుణం తీర్చుకోవడం కోసం ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించారని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి ఎన్టీఆర్ అని ప్రశంసలు కురిపించారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదల కోసం ఎంతో కృషి చేసిన ఎన్టీఆర్.. తెలుగు జాతి ఉన్నంతవరకు ఉంటారన్నారు. క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వంలాగా ఎన్టీఆర్ శకం అని చెప్పుకోవాలని వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

Mahanadu2023: మహానాడు వేదికగా సీఎం జగన్‌పై బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు

Next Story

Most Viewed