- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో ఆహార నాణ్యత టెస్టింగ్ ల్యాబ్ ప్రారంభం
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) ప్రారంభించారు.

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఆధ్వర్యంలో తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు(BR Naidu) ప్రారంభించారు. ఈ ల్యాబ్ ద్వారా తిరుమలలో భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదం, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను సమర్థవంతంగా పరీక్షించవచ్చు. దీనివల్ల ఆహార ప్రమాణాలు మరింత సమర్థవంతంగా నిర్వహించబడతాయి. కాగా ఈ ల్యాబ్లోని అధునాతన యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB) విరాళంగా అందించింది.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ... ఈ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన, నాణ్యమైన ప్రసాదాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. త్వరలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) గుర్తింపు పొందిన ల్యాబ్ను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ FSSAI ల్యాబ్ ఆహార నాణ్యత పరీక్షలలో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తుంది.






