తుఫాను బీభత్సం... అరకు ఘాట్‌రోడ్డును ముంచెత్తిన వరద

by Muthe.Rajitha |

మొంథా తుఫాను అంతర్వేది వద్ద తీరాన్ని తాకింది.

తుఫాను బీభత్సం... అరకు ఘాట్‌రోడ్డును ముంచెత్తిన వరద
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను అంతర్వేది వద్ద తీరాన్ని తాకింది. తుఫాను ఎఫెక్టుతో ఇప్పటికే ఏపీలోని అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తుండంతోపాటు.. 100కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కాగా మొంథా తుపాను ప్రభావంతో అల్లూరి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. జోరువానలకు అరకులోయ- విశాఖపట్నం ఘాట్‌రోడ్డులో భారీగా వరద ప్రవహిస్తోంది. సుంకరమెట్ట కాఫీ తోటలు, అనంతగిరి తదితర ప్రదేశాల వద్దపైకి చేరడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ మార్గంలో రాకపోకలను అతికష్టం మీద సాగించాల్సిన పరిస్థితి నెలకొంది.


Next Story