తెప్ప బోటులో చేపల వేట.. తీవ్ర విషాదం

by Vemula.Srinu Prasad |

నెల్లూరు జిల్లా బోగోలు సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట కోసం ఓ తెప్ప బోటుపై నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. ..

తెప్ప బోటులో చేపల వేట.. తీవ్ర విషాదం
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా బోగోలు సముద్ర తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. చేపల వేట కోసం ఓ తెప్ప బోటుపై నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అయితే ఊహించని విధంగా సముద్రంలో అలల తాకిడికి బోటు అదుపుతప్పి తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని అలిచర్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన తూపిలి బాల మురళి (51), కుమారి గోవిందు (42)గా గుర్తించారు. ప్రమాద సమయంలో బోటులో ఉన్న మిగిలిన ఇద్దరు మత్స్యకారులు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. ఈ ఘటనతో అలిచర్ల బంగారుపాలెం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story