ఆర్టీసీ బస్సులో మంటలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు

by Thanuru Gopichand |

ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది.

ఆర్టీసీ బస్సులో మంటలు.. ఉలిక్కిపడ్డ ప్రయాణికులు
X

దిశ, డైనమిక్​ బ్యూరో : ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణిస్తున్నారు. ఎమ్మిగనూరు నుండి కర్నూల్ కి వెళ్తున్న గోనెగండ్ల దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్ వల్ల ఒకేసారి చెలరేగినట్లు సమాచారం. దీంతో బస్సులో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. డ్రైవరు చాకచక్యంగా వ్యవహరిసించి మంటలను ఆర్పారు. అంతకు ముందే ప్రయాణికులను బస్సులోంచి దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Next Story