మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. చైన్ లాగడంతో

by Disha Web Desk 21 |
మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు.. చైన్ లాగడంతో
X

దిశ,వెబ్‌డెస్క్: ఒడిశారైలు ప్రమాదం మరవక ముందే..రైల్వేలో మరో ప్రమాదానికి తావిచ్చింది. మచిలీపట్నం -తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగాయి. ఎక్స్‌ప్రెస్ రైలు తిరుపతికి వెళ్తుండగా బోగీల్లోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల రాపిడితో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలులో మంటలు వ్యాప్తి చెందకుండా ఆగిపోయాయి. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వెంటనే రైలు దిగడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. ఈ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చారు. 20 నిమిషాల తర్వాత తిరిగి తిరుపతికి రైలు బయల్దేరింది. రైల్వేలో జరుగుతున్న చిన్న చిన్న తప్పిదాలవల్ల భారీ నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికైనా రైల్వే అధికారులు అప్రమత్తంగా ఉంటే ప్రమాదాల భారి నుండి తప్పించుకోవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: బిగ్ బ్రేకింగ్: ఒడిషాలో పట్టాలు తప్పిన మరో ట్రైన్


Next Story