Tragedy:పిడుగుపాటుకు తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-20 08:39:27  IST  )

ఏపీ(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.

Tragedy:పిడుగుపాటుకు తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు తండ్రి మృతి చెందగా.. అతని కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శ్రీకాకుళంలోని బలగ బుచ్చిపేటలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జిల్లా(Srikakulam District)లోని బలగ బుచ్చిపేటలో గేదేల రాజారావు(53), తన కుమారుడు నాగార్జున(23) ఇద్దరూ కలిసి నాగావళి నది తీరాన స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో ఈదురు గాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. ఈ తరుణంలో నది తీరాన స్నానం చేస్తుండగా పిడుగు పడింది. దీంతో తండ్రి రాజారావు తీవ్రంగా గాయపడగా.. రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. తండ్రి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story