ఉన్నదంతా అమ్ముకొని రోడ్డుమీదకు వస్తున్న పవన్ కల్యాణ్.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 2 |
ఉన్నదంతా అమ్ముకొని రోడ్డుమీదకు వస్తున్న పవన్ కల్యాణ్.. కన్నీరు పెడుతున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ సినిమాలకు పూర్తి గ్యాప్ ఇచ్చి పవన్ కల్యాణ్ రాజకీయాల్లో దూకుడు పెంచాడు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ప్రస్తుతం నిమగ్నం అయ్యారు. ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు వచ్చిన విషయం తెలిసిందే. ఐదుగురు అభ్యర్థులను ఖరారు చేసిన పవన్ కల్యాణ్.. మిగిలిన నియోజకవర్గాల్లో పోటీచేసే గెలుపు గుర్రాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌పై సొంత అభిమానులే విమర్శలు చేస్తున్నారు. కేవలం 24 సీట్లకే పరిమితం కావడంపై మండిపడుతున్నారు. పదేళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతూ, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించడమే కాకుండా ఆపద సమయంలో టీడీపీకి అండగా ఉన్న జనసేనకు 24 సీట్లు ఇవ్వడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితిపై ఇప్పటికే పవన్ కల్యాణ్‌ కూడా క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా అధిక సీట్లు తీసుకొని ఓడిపోవడం కంటే కచ్చితంగా గెలవగలం అనే నమ్మకమున్న స్థానాల్లో పోటీ చేయడం ఉత్తమమని అభిప్రాయానికి వచ్చారు.

ఇదే విషయాన్ని గత నాలుగైదు రోజులుగా జనసైనికులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త తెలిసిన జనసైనికులు ఏకంగా కన్నీరు పెడుతున్నారనడంలో సందేహం లేదు. అయితే, రాబోయే ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ తనకున్న వందకోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన ఇల్లు, ప్రాపర్టీస్ అన్నీ అమ్మకానికి పెట్టి అభ్యర్థుల ప్రచారానికి డబ్బులు సమకూర్చడానికి సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు కామెంట్ల రూపంలో ఎమోషనల్ అవుతున్నారు. ‘పోటీ చేసిన రెండు చోట్లా ఓడించిన ఈ జనాల కోసం ఎందుకు అన్నా ఇంత త్యాగం’ అని కొందరు కామెంట్లు పెడుతుండగా.. ‘నువ్వు ఉన్నదంతా అమ్ముకొని రోడ్డున పడ్డా ఈ జనాల్లో మార్పు రాదు అన్నా’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా కన్నీరు పెడుతున్న ఎమోజీస్‌తో కామెంట్ల బాక్సును నింపేస్తున్నారు.

Read More..

Breaking: పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్.. కీలక నేతలంతా ఆ పార్టీలోకి జంప్!


Next Story