వెంట్రుక కూడా పీకలేరు.. మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్ సంచలన వ్యాఖ్యలు

by Ajay kumar |
వెంట్రుక కూడా పీకలేరు.. మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: చంద్ర‌బాబు హ‌త్యా రాజకీయాలతో, అక్ర‌మ కేసుల‌తో వైసీపీ లీడ‌ర్ల‌ను గానీ, కేడ‌ర్‌ను గానీ పిక్కమీద వెంట్రుక కూడా పీకలేరని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. జైలు నుండి వచ్చిన తరవాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఓడేది లేదని కూటమి గెలిచేది లేదన్నారు. ప్రతిరోజూ రాష్ట్రంలో రాజకీయ హత్యలు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని పిడికిలిలో బిగించుకున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు అన్నింటినీ పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలని హితవుపలికారు. ఇదిలా ఉంటే మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అసభ్యకర కామెంట్లు చేసిన చేబ్రోలు కిరణ్ పై మాదవ్ దాడి చేసేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయనపై పోలీసులపై దాడి చేశారు. ఈ కేసులో అరెస్ట్ పై జైలుకు వెళ్లగా బెయిల్ పై తాజాగా బయటకు వచ్చారు.



Next Story

Most Viewed