తొలిసారి గ్రామంలో విద్యుత్ వెలుగులు.. ఆనందంలో నృత్యం చేసిన గిరిజనులు

by Ajay Maddhiboyina |

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 79ఏళ్లైనా ఇప్పటి వ‌ర‌కు క‌రెంట్ అంద‌ని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి.

తొలిసారి గ్రామంలో విద్యుత్ వెలుగులు.. ఆనందంలో నృత్యం చేసిన గిరిజనులు
X

దిశ‌, వెబ్ డెస్క్: దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 79ఏళ్లైనా ఇప్పటి వ‌ర‌కు క‌రెంట్ అంద‌ని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. ఫారెస్ట్ అనుమ‌తులు ఇత‌ర సాకులు చెబుతూ చాలా గ్రామాల‌కు రోడ్లు, విద్యుత్ వ‌స‌తులు క‌ల్పించ‌క‌పోవ‌డంతో ఇంకా చీక‌టిలోనే ఆ గ్రామాలు మ‌గ్గిపోతున్నాయి. అలాంటి గ్రామాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనకాపల్లి జిల్లా మాడుగుల గ్రామం కూడా ఒకటి. అయితే తాజాగా ఆ గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చాయి. దీంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలోని గిరిజనులు అంతా ఎంతో ఆనందపడ్డారు. ఈ క్రమంలోనే ఆ గ్రామస్థులు తమ గిరిజన ఆచారంలోని థింసా నృత్యం చేసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీంతో గ్రామంలోనే కాకుండా వారి ముఖాల్లోనూ వెలుగులు కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో మిగితా గిరిజన గ్రామాలకు కూడా కరెంట్ అందించాలని నెటిజన్లు కోరుతున్నారు. వీడియో

Next Story