- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ మస్తాన్
ఏసీబీ వలకు విద్యుత్ ఏఈ మస్తాన్ చిక్కారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఏసీబీ(Acb) వలకి విద్యుత్ ఏఈ చిక్కారు. రైతు(Farmer)ను లంచం డిమాండ్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఈ ఘటన పల్నాడు జిల్లా కారంపూడి(Karampudi)లో జరిగింది. ఎలక్ట్రికల్ సర్వీస్ కనెక్షన్ ఇచ్చి మీటర్ బిగించేందుకు షేక్ మస్తాన్ జానీ నుంచి విద్యుత్ ఏఈ కోటపెద మస్తాన్ రూ. 25 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించారు. ఈ మేరకు పక్కా పథకం ప్రకారం విద్యుత్ ఏఈని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాతే మాట్లాడుతూ విద్యుత్ ఏఈ మస్తాన్ పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నట్టు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచాలు ఇవ్వాలని బెదిరించిన యెడల 1064 టోల్ ఫ్రీ నెంబర్ను సంప్రదించాలని తెలిపారు.
Next Story






