Accident: కంటైనర్‌ను ఢీకొట్టిన వాహనాలు.. ఇద్దరు దుర్మరణం

by Disha Web Desk 16 |
Accident: కంటైనర్‌ను ఢీకొట్టిన వాహనాలు.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో హైవే ఫ్లై ఓవర్ దగ్గర భారీ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పంక్చర్ అయ్యింది. దీంతో ఆ కారు రైట్ సైడ్‌కి దూసుకెళ్లి బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ రెండు వాహనాలు అటుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టాయి. దీంతో కారులో ఉన్న ముగ్గురిలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగిలిన వ్యక్తిని కొవ్వూరు గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.


Next Story

Most Viewed