Food Poisoning:15 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

by Disha Web Desk 16 |
Food Poisoning:15 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమగోదావరి జిల్లా తణుకు ఎంపీపీ స్కూల్‌లో మధ్యాహ్న భోజనం వికటించి చిన్నారులు ఆస్పత్రి పాలయ్యారు. మధ్యాహ్నాం భోజనం తిన్న తర్వాత ఒక్కొక్కరుగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 15 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు, స్థానికులు తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే మధ్యాహ్నం భోజనం కలుషితం అయి ఉండవచ్చునని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed