Eluruలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్

by Disha Web Desk 16 |
Eluruలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్
X

దిశ, ఏలూరు: ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న కాపు నేత చేగొండి హరిరామ జోగయ్యను పరామర్శించేందుకు టీడీపీకి చెందిన చింతమనేని ప్రభాకర్‌తోపాటు పలువురు టీడీపీ నేతలు ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే లోపలికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కాలర్ పట్టుకుని పోలీసులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తోపాటు పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read...

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలి: Kodali Nani

Next Story

Most Viewed