సహకార సంఘంలో రూ. 2 కోట్లు గోల్ మాల్.. రైతుల ఆందోళన

by Vemula.Srinu Prasad |

తూర్పు గోదావరి జిల్లా వెదుళ్లపల్లినీతానగరంలో రైతులు ఆందోళనకు దిగారు.....

సహకార సంఘంలో రూ. 2 కోట్లు గోల్ మాల్.. రైతుల ఆందోళన
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లా(East Godavari District) సీతానగరం మండలం వెదుళ్లపల్లి(Vedullapalli)లో రైతులు(Farmers) ఆందోళనకు దిగారు. ది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో రూ. 2 కోట్లు గోల్ మాల్ జరిగినట్లు ఆరోపిస్తున్నారు. సురేశ్ అనే వ్యక్తి గోల్ మాల్‌కు పాల్పడ్డారని, అయితే ఆయనకు అధికారులు అండగా నిలిచారని మండిపడ్డారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ నుంచి తీసుకున్న రుణాల డబ్బును సహకార సంఘం బ్యాంకులో సరిగా జమచేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story