వేట్లపాలెం బ్లాస్ట్‌లో మరో వ్యక్తి మృతి... 24కి చేరిన మరణాల సంఖ్య

by Vemula.Srinu Prasad |

కాకినాడ జిల్లా వేట్లపాలెం బ్లాస్ట్ ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది.. చికిత్స పొందుతూ వీర శ్రీనివాస్ మృతి చెందారు..

వేట్లపాలెం బ్లాస్ట్‌లో మరో వ్యక్తి మృతి... 24కి చేరిన మరణాల సంఖ్య
X

దిశ, వెబ్ డెస్క్: కాకినాడ జిల్లా(Kakinada District) వేట్లపాలెం బ్లాస్ట్(Vetlapalam) ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సామర్లకోట చికిత్స పొందుతూ ఆస్పత్రిలో వీర శ్రీనివాస్ అనే వ్యక్తి మృతి చెందారు. ఈ మరణంతో మృతుల సంఖ్య 24కు చేరింది. వేట్లపాలెం బ్లాస్ట్‌ జరిగిన సమయంలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు సైతం మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వీర శ్రీనివాస్‌కు జీజీహెచ్‌కు తరలించారు అయితే ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. సామర్లకోట కుమ్మరవీధికి చెందిన శ్రీనివాస్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోస్టుమార్తం నిమిత్తం ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

Next Story