పొత్తులో అనూహ్య పరిణామం.. జనసేనకు పి.గన్నవరం సీటు

by Disha Web Desk 16 |
పొత్తులో అనూహ్య పరిణామం.. జనసేనకు పి.గన్నవరం సీటు
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ, జనసేన పొత్తులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పి.గన్నవరం సీటును తొలుత టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేశ్ (మహాసేన రాజేశ్)కు కేటాయించారు. అయితే మహేశ్ అభ్యర్థిత్వంపై స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో పి.గన్నవరం సీటును జనసేనకు చంద్రబాబు కేటాయించారు. ఈ మేరకు కూటమి అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. హైదరాబాద్‌లో పోలీస్ అధికారిగా పని చేసిన సత్యనారాయణ.. రెండు నెలల క్రితం జనసేనలో చేరారు. దీంతో పి.గన్నవరం అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణకు అవకాశం దక్కింది.



Next Story

Most Viewed