Dwaraka Tirumala: దారుణం.. గుండెపోటుతో అయ్య‌ప్ప మాల‌ధారుడు మృతి

by Ramesh Goud |

గుండెపోటు(Heart Attack)తో అయ్య‌ప్ప మాల‌ధారుడు మృతి(Death) చెందిన ఘటన ఏలూరు జిల్లా(Eluru District) ద్వారక తిరుమల(Dwaraka Tirumala)లో జరిగింది.

Dwaraka Tirumala: దారుణం.. గుండెపోటుతో అయ్య‌ప్ప మాల‌ధారుడు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గుండెపోటు(Heart Attack)తో అయ్య‌ప్ప మాల‌ధారుడు మృతి(Death) చెందిన ఘటన ఏలూరు జిల్లా(Eluru District) ద్వారక తిరుమల(Dwaraka Tirumala)లో జరిగింది. అమలాపురం మండలం(Amalapuram Mandal) ఇందుపల్లి(Indupalli)కి చెందిన సురేష్(27) అనే యువకుడు అయ్యప్ప మాల ధరించారు. చిన్న తిరుమలగా పిలుచుకునే ద్వారక తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు స్నేహితులతో కలిసి వచ్చారు. దర్శనం చేసుకునేందుకు క్యూలైన్ లో వెళుతూ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌(Vaikuntam Queue Complex)కి వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురైన సురేష్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అప్రమత్తమైన స్నేహితులు హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యులు అప్ప‌టికే మృతిచెందిన‌ట్టు తెలిపారు.

Next Story