- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దువ్వాడ ను ఇంటి నుంచి గెంటేశారు.. మేమిద్దరం కలిసి ఉంటాం: మాధురి
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

దిశ, వెబ్డెస్క్: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ ఇష్యూ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇదే విషయంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ వ్యవస్థలో భర్త నిర్ణయానికి భార్య కట్టుబడి ఉండాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధికారం ఉన్నా.. లేకున్నా ఒకే విధంగా పనిచేస్తున్నా అని అన్నారు. 25 ఏళ్లుగా ప్రజల మధ్యే ఉంటూ వస్తున్నానని తెలిపారు. కానీ, చివరకు నా కుటుంబమే నాపై దాడికి రెడీ అయిందని ఆవేదన చెందారు.
ఇదిలా ఉండగా శ్రీనివాస్ దివ్వెల మాధురి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. దీంతో వైసీపీ నేత మాధురి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీనివాస్, నేను కలిసే ఉంటాం. మా బంధాన్ని రాజకీయ కోణంలో చూడవద్దు. ఎవరు మా వ్యక్తిగత జీవితాల్లోకి రాకూడదు. శ్రీనివాస్ను తల్లీ కూతుర్లు ఇంటి నుంచి గెంటేశారు. దువ్వాడ విషయంలో టీడీపీ రాజకీయం చేస్తోందని మాధురి మీడియాతో చెప్పుకొచ్చారు.






