AP Assembly: జ్వరం తగ్గే వరకు అసెంబ్లీకి రావద్దు.. రామానాయుడికి.. డిప్యూటీ స్పీకర్ ​రూలింగ్​

by Thanuru Gopichand |

ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది.

AP Assembly: జ్వరం తగ్గే వరకు అసెంబ్లీకి రావద్దు..  రామానాయుడికి.. డిప్యూటీ స్పీకర్ ​రూలింగ్​
X

దిశ, డైనమిక్​ బ్యూరో: ఏపీ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తి పరిణామం చోటు చేసుకుంది. శాసనసభకు ఈ రోజు మంత్రి రామానాయుడు (Nimmala Ramanaidu)చేతికి క్యానులా పెట్టుకుని వచ్చారు. దీని గమనించిన మంత్రి లోకేశ్​ (minister lokesh) అన్నకు బాగోలేదు అయినా అసెంబ్లీకి వచ్చేస్తున్నారు. చెప్పినా వినడం లేదు. మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా అని కోరారు. స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దీనిపై స్పందించారు. రామానాయుడు పని రాక్షసుడు.. ప్రజాసేవతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. జ్వరం (Fever) తగ్గేవరకు అసెంబ్లీకి రావద్దు. ఇది నా రూలింగ్ అని అన్నారు. బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జ్వరం అని నాకు తెలియదు.. రామానాయుడు నాకు చాలా కాలంగా తెలుసు మా ఊరు పక్కవాడే. పట్టుదల మనిషి అని అన్నారు.

Next Story