రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ముర్ము.. స్వాగతం పలకనున్న పవన్ కల్యాణ్

by Vemula.Srinu Prasad |

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏపీకి వస్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రెండు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు...

రేపు రాష్ట్రానికి రాష్ట్రపతి ముర్ము.. స్వాగతం పలకనున్న పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(India President Draupadi Murmu) ఏపీకి వస్తున్నారు. మంగళవారం విశాఖ(Visakha)లో ఆమె పర్యటించనున్నారు. ఢిల్లీ(Delhi) నుంచి మధ్యాహ్నానికి విశాఖ ఎయిర్ పోర్టు(Visakha Air Port)కు రాష్ట్రపతి చేరుకుంటారు. ఈ మేరకు ఆమెకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) స్వాగతం పలికనున్నారు. ఇందులో భాగంగా విశాఖలో పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అయితే రాష్ట్రపతి ముర్ము విశాఖలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

Next Story