- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బలపడుతోన్న ‘మొంథా’ తుపాన్.. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా సైక్లోన్ ఉత్తర - వాయవ్య దిశగా దిశగా కదులుతూ మచిలీపట్నం, కాళింగపట్నం మధ్య కాకినాడ జిల్లా సమీపంలో తీరం దాటనుందని ప్రజలకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.

X
దిశ, వెబ్డెస్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా సైక్లోన్ ఉత్తర - వాయవ్య దిశగా దిశగా కదులుతూ మచిలీపట్నం, కాళింగపట్నం మధ్య కాకినాడ జిల్లా సమీపంలో తీరం దాటనుందని ప్రజలకు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఆ సమయంలో గంటకు గరిష్ఠంగా 110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. మరోవైపు తుపాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని పోర్టులకు హెచ్చరికల స్థాయిని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పెంచింది. కాకినాడ పోర్టుకు ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖపట్నం, గంగవరం పోర్టులకు ఆరు, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
Read More..
Next Story






