సీఎం వైఎస్ జగన్‌కు CPI Ramakrishna లేఖ

by Dishanational2 |
సీఎం వైఎస్ జగన్‌కు CPI Ramakrishna లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని యూనివర్సిటీలలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మంగళవారం లేఖ రాశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో యధావిధిగా లా అడ్మిషన్లకు చర్యలు చేపట్టాలని కోరారు. అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీలో లా అడ్మిషన్లు చేపట్టవద్దని కోరుతూ రిజిస్ట్రార్ ఉన్నత విద్యా మండలి కార్యదర్శికి లేఖ రాయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుని కర్నూలులో ఏర్పాటు చేస్తామని చెబుతోంది. మరోపక్క ఎస్‌కే యూనివర్సిటీలో లా అడ్మిషన్లు వద్దంటున్నారు. ఎస్‌కే యూనివర్సిటీలో న్యాయ శాస్త్ర విభాగాన్ని ఆపేయటం న్యాయమా? అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పలు విభాగాలకు అధ్యాపకులు, సిబ్బంది నియామకాలు చేపట్టాలి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను లేఖలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ కోరారు.



Next Story

Most Viewed