- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. నిందితులకు షాకిచ్చిన కోర్టు
ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది.

దిశ, వెబ్డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డి (ఏ6), బాలాజీ గోవిందప్ప(ఏ33)ల బెయిల్ పిటిషన్లను పరిశీలించిన కోర్టు డిస్మిస్ చేసినట్లు తెలిపింది.
జులై 10న సీఐడీ సిట్ ఈ కేసులో ఏ5గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. గతంలోనూ సిట్ విజయసాయిరెడ్డిని ఈ కేసులో ప్రశ్నించింది. నాడు అన్నీ రాజ్ కసిరెడ్డినే చేశారని చెప్పారాయన. ఆ తర్వాత సీఐడీ అనేక మందిని అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ లో కొల్లగొట్టిన సొమ్ముతో ప్రధాన నిందితుడైన రాజ్ కెసిరెడ్డి ఈడీ ఎంటర్టైన్ మెంట్స్ అనే నిర్మాణసంస్థను నెలకొల్పి సుమంత్ హీరోగా మళ్లీ మొదలైంది, నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా స్పై సినిమాలను నిర్మించారు. ఆ తర్వాత కూడా యువ డైరెక్టర్లు, రచయితలకూ అవకాశాల పేరుతో భారీగా అడ్వాన్సులిచ్చారు. స్కామ్ లో నగదు రూపంలో వచ్చిన డబ్బుతో సినిమాలు తీయాలనుకున్న సమయంలో ఎన్నికలు రావడం, జగన్ అధికారం కోల్పోవడంతో చేసేది లేక కొత్త ప్రాజెక్టులను ఆపివేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.






