- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. యాసిడ్ తాగి దంపతుల మృతి
by Naga Rani Yarlagadda |
యాసిడ్ తాగి దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. వారి కూతురి పరిస్థితి విషమంగా మారింది.

X
దిశ, వెబ్డెస్క్: యాసిడ్ తాగి దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. వారి కూతురి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు గ్రామంలో జరిగింది. అప్పారావు, లలిత దంపతులకు దేవి అనే కుమార్తె ఉంది. చాలా కాలంగా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతోంది. దీనికి తోడు అప్పారావును అంధత్వం వేధిస్తోంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. దంపతులు మృతి చెందగా.. వారి కూతురు దేవి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






