రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు

by Web Desk |
రాష్ట్రంలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. తాజాగా వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,357 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 11,573 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,06,181 చేరుకుంది. అయితే గత 24 గంటల్లో మహమ్మారి కారణంగా చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.

దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,594 గా ఉంది. ఇకపోతే ప్రస్తుతం రాష్ట్రంలో 1,15,425 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,24,06,132 సాంపిల్స్‌‌ని పరీక్షించడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. కరోనా తగ్గుముఖం పట్టినా, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే సంపూర్ణంగా కరోనాను పారదోల వచ్చునని అధికారులు సూచిస్తున్నారు.

Next Story

Most Viewed