- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బనకచర్లకు అంగీకరిస్తే తెలగాణకు అన్యాయమే: కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ
లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.

దిశ, వెబ్ డెస్క్: లోక్సభ(Lokhsabha) సాక్షిగా కేంద్ర ప్రభుత్వం(Union)పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు కేటాయించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దతు ఇచ్చే ఉద్దేశంతోనే కేంద్రం ఈ కేటాయింపులకు అంగీకారం తెలిపిందని ఎంపీ వంశీ కృష్ణ విమర్శించారు.
మౌలిక సదుపాయాల కల్పనలోనూ..
మౌలిక సదుపాయాల కల్పనలోనూ తెలంగాణ పట్ల వివక్ష కొనసాగుతోందని వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దాదాపు 9 విమానాశ్రయాలు ఉన్నాయని గుర్తు చేశారు. కొత్త విమానాశ్రయాల కేటాయింపులో తెలంగాణను విస్మరించడం సరికాదన్నారు. విభజన హామీలను గాలికొదిలేసి, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక రాష్ట్రానికి కొమ్ముకాస్తూ తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఎంపీ వంశీకృష్ణ నిలదీశారు.






