నందమూరి బాలకృష్ణపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు

by Disha Web Desk 2 |
నందమూరి బాలకృష్ణపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌పై ఎలక్షన్ కమిషన్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా బాలయ్య, లోకేష్ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ప్రభుత్వంపై ఎన్ఆర్‌ఐలు దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. కాగా, ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘జాబ్‌క్యాలెండర్‌ అని, సీపీఎస్‌ రద్దని, మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేసిన నయ వంచకుడు జగన్‌’ అంటూ ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed